గణేష్‌ విగ్రహంతో సెల్ఫీ దిగండి..గిఫ్ట్ గెలుచుకోండి

గణేష్‌ విగ్రహంతో సెల్ఫీ దిగండి..గిఫ్ట్ గెలుచుకోండి

రిలయన్స్ రీటైల్‌కు చెందిన ట్రెండ్స్ తన కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిషా రాష్ట్రాలలో ‘ట్రెండ్స్ సెల్ఫీ విత్ గణేష్’ పోటీని ప్రకటించింది. వినాయకుడి విగ్రహంతో ట్రెండ్స్ సెల్ఫీ అనే ఈ ఆసక్తికరమైన పోటీ గణేష్ చతుర్థి పండుగ నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 21 వరకు ఉంటుందని తెలిపింది. 

వినియోగదారులు తమ ఇళ్లల్లో గణేశుడి విగ్రహం దగ్గర అలంకరణతో పాటు తాము తీసుకున్న ఫొటో లేదా సెల్ఫీని ఈ పోటీకి ఎంట్రీ గా పంపించవచ్చు. ‘ఉత్తమమైన గణేష విగ్రహం అలంకరణ’ గా నిర్ణయించబడిన సెల్ఫీ కి రూ. 1500 విలువ చేసే బహుమతి లభిస్తుంది. అంతే కాదు.. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ట్రెండ్స్ నుంచి డిస్కౌంట్ కూపన్ కూడా లభిస్తుంది. దీనిని మీరు దగ్గరలో ఉన్న ట్రెండ్స్ స్టోర్ నుంచి పొందవచ్చు. ఈ పోటీ గురించిన ప్రకటన, ఇందులో పాల్గొనే పద్ధతి, ఇతర వివరాలను వినియోగదారులకు వారి సమీపం లోని ట్రెండ్స్ స్టోర్ నుంచి అందించబడతాయి. పోటీలో విజేతలు ఆయా పట్టణాలకు చెందిన సుప్రసిద్ధ ఆర్ట్ టీచర్ల ద్వారా ఎంపిక చేయబడతారు.