మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రత తొలగింపు

మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రత తొలగింపు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.  మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రతను తొలగించింది. ఈ మేరకు పోలీస్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వారి గన్ మెన్స్ ను పోలీస్ శాఖ విత్ డ్రా చేసుకుంది.  ఎవరెవరికి గన్ మెన్స్ అవసరమనే దానిపై ఇంటెలీజెన్స్‌ అధికారులు సమీక్షించనున్నారు.  అనంతరం వారికి గన్ మెన్స్ ను కేటాయించనున్నారు.  

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. మూసీ అభివృద్ధి సంస్థ ఇన్‌ఛార్జి ఎండీగానూ ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు కేటాయించారు. ఈ మేరకు బదిలీలకు సంబంధించి సీఎస్‌ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

మరికొందరు అధికారులు..  వారికి కేటాయించిన శాఖలు 

  • వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌.
  • ట్రాన్స్‌కో సంయుక్త ఎండీగా సందీప్‌కుమార్‌ ఝా.
  • దక్షిణ డిస్కమ్‌ సీఎండీగా ముషారఫ్‌ అలీ.
  • ఉత్తర డిస్కమ్‌ సీఎండీగా కర్ణాటి వరుణ్‌ రెడ్డి.
  • వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా బి.గోపి.