కరోనాతో రిపోర్టర్ మృతి: లాడ్జీలో తలదాచుకున్న కుటుంబం

కరోనాతో రిపోర్టర్ మృతి: లాడ్జీలో తలదాచుకున్న కుటుంబం

ఆదివారం(మే-2) కరోనాతో మృతి చెందిన వరంగల్ జిల్లా కాశిబుగ్గకు చెందిన రిపోర్టర్ నాగరాజు కుటుంబం పరిస్థితి ఇపుడు చాలా దయనీయంగా మారింది. స్టేషన్ రోడ్‌లోని ఓలాడ్జీలో ఈ కుటుంబం తల దాచుకుంటోంది. రిపోర్టర్ భార్య, కూతురు, అమ్మ, భర్త వదిలేసిన చెల్లెలు.. ఇలా ఇంట్లో నలుగురూ ఆడవాళ్ళే. అయిన వాళ్ళు లేకపోగా.. ఇంటి ఓనర్ కూడా ఇంట్లోకి రానివ్వడం లేదు. దీంతో దిక్కు తోచని స్థితిలో ఆ కుటుంబం ఇలా లాడ్జీలో ఉండాల్సిన దారుణమైన పరిస్థితి ఏర్పడింది.