
ఒకప్పుడు సౌత్ డైరెక్టర్లని పట్టించుకోని బాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు తమ రూట్ మార్చుకుంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ బడా స్టార్స్ కన్నంతా సౌత్ డైరెక్టర్ల పైనే పడింది. షారూఖ్ ఖాన్ ఇప్పటికే తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో జవాన్ తీసి హిట్ కొట్టాడు. ఇటీవలే సల్మాన్ ఖాన్ తమిళ టాప్ డైరెక్టర్లలో ఒకడైన మురుగుదాస్తో చేతులు కలిపి సికిందర్ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ లిస్ట్ లో బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ చేరాడని తెలుస్తోంది.అతను సౌత్ ఇండియా బెస్ట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరొందిన లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి.
పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రాబోతున్న ఈ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించబోతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న లోకేష్ తో అమీర్ ఖాన్ సినిమా అనేసరికి అంచనాలు అమాంతం పెంచేసుకుంటున్నారు సినిమా ప్రేమికులు. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. అయితే ఈ సినిమా గురించి దర్శకుడు కానీ, హీరో కానీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఖైదీ, విక్రమ్, మాస్టర్, లియో లాంటి బ్లాక్ బస్టర్లతో లోకేష్ పాన్ ఇండియా దర్శకుడిగా ఎదిగాడు.
లోకేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి కూలీ సినిమా చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. సత్యరాజ్, శృతి హాసన్, మహేంద్రన్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇతను చివరిసారిగా చేసిన లియో సినిమా 600 కోట్లకు పైగా వసూల్ చేసింది. తలపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా అతని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మరోవైపు ఆమీర్ ఖాన్ తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్గా వస్తున్నా సితారే జమీన్ పర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. చివరిసారిగా అమీర్ లాల్ సింగ్ చద్దా చిత్రంలో నటించాడు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2022లో రిలీజై డిజాస్టర్ గా నిలిచింది.
BIG BREAKING - A Mindblowing Combo!!#AamirKhan, #LokeshKanagaraj and #MythriMovies are teaming up for a PAN India film soon. According to our very reliable sources, the project is CONFIRMED. pic.twitter.com/NJx8PBbgzY
— Aakashavaani (@TheAakashavaani) August 18, 2024