హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను శుక్రవారం బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు. అసెంబ్లీ ఆవరణలో బీజేపీ ఎల్పీకి గది కేటాయించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ వినతి పత్రం అందజేశారు.