అక్టోబర్ నుంచి ధరలు తగ్గుముఖం

అక్టోబర్ నుంచి ధరలు తగ్గుముఖం

న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ (ధరల పెరుగుదల ఆగుతుందని ) తగ్గుముఖం పడుతుందని రిజర్వ్ బ్యాంక్  గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఎకానమీ స్లోడౌన్‌‌‌‌‌‌‌‌ అవుతుందనే అంచనాలకు ఆయన ముగింపు పలికారు. ఓ ఎకనామిక్ కాన్‌‌‌‌‌‌‌‌క్లేవ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు.  వివిధ కారణాలతో ఇండియాతో సహా అనేక దేశాల్లో  ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆర్‌‌బీఐ కూడా కీలక వడ్డీ రేటును 90 బేసిస్ పాయింట్లు పెంచింది.   రేట్ల పెంపు ప్రభావం ఎకానమీపై నెగెటివ్‌‌‌‌‌‌‌‌గా లేకుండా చూడడమే తమ ముందు ఉన్న పెద్ద పని అని శక్తికాంత దాస్‌  అన్నారు.