గర్భిణులకు మార్గదర్శనం చేస్తున్న ఆర్యజనని సంస్థ ఈ నెల 18 నుంచి రెసిడెన్షియల్ రిట్రీట్ నిర్వహించనుంది. మేడ్చల్ జిల్లా కీసరగుట్టలో ఉన్న శ్రీరామకృష్ణ వానప్రస్థ ఆశ్రమంలో ఈ రిట్రీట్ జరగనుంది. మహిళ గర్భం దాల్చిన నుంచి బిడ్డకు రెండేళ్ళు నిండే వరకు గర్భిణులు పాటించవలసిన సూచనలను గైనకాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు వివరించనున్నారు.
ప్రసవానికి ముందు యోగా, గాఢమైన విశ్రాంతి, ధ్యానం వంటి వాటికి సంబంధించిన చిట్కాలను తెలియజేయనున్నారు. గర్భధారణ, మాతృత్వంపై నిపుణులు, అనుభవజ్ఞులైన వారితో మాట్లాడవచ్చని ఆర్యజనని నిర్వాహకులు తెలిపారు.
రెసిడెన్షియల్ రిట్రీట్కు హాజరుకావాలనుకునేవారు https://aaryajanani.org/pregnancy-retreat-registration-form/ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. 9959696222, 9603906906 నంబర్లకు వాట్సాప్ ద్వారా సంప్రదించాలని సూచించారు.