
సుజాతనగర్, వెలుగు : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనమైన సుజాతనగర్ కు చెందిన ఏడు గ్రామ పంచాయతీలను నాలుగు డివిజన్లుగా విభజించారు. దీనిలో కోమటిపల్లి, నిమ్మలగూడెం గ్రామ ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గురువారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోమటిపల్లి, నిమ్మలగూడెంతో హరిజనవాడ, గొల్లగూడెం, సుందరయ్య నగర్, అంబేద్కర్ నగర్ ను కలపడం ద్వారా గిరిజన తండాల అభివృద్ధి జరగదని, వీటికి బదులుగా పక్కనే ఉన్న లక్ష్మీదేవిపల్లి గ్రామాన్ని కలపాలని కోరారు. కోమటిపల్లి తాజా మాజీ ఎంపీటీసీ మూడ్ గణేశ్, మాజీ ఎంపీటీసీ తుంపురు రాములు, భూక్య భీమా, కూన్సొత్ భగత్ సింగ్, భూక్య శ్రీను, భూక్య రాజేశ్, మూడ్ ప్రశాంత్ పాల్గొన్నారు.