రాజగోపాల్ రెడ్డికి శివన్నగూడ రిజర్వాయర్ నిర్వాసితుల పాలాభిషేకం

రాజగోపాల్ రెడ్డికి శివన్నగూడ రిజర్వాయర్ నిర్వాసితుల పాలాభిషేకం

చండూరు/మర్రిగూడ, వెలుగు: శివన్నగూడ రిజర్వాయర్ లో భూములు కోల్పోయిన చర్లగూడెం, వెంకేపల్లి, వెంకేపల్లి తండా భూ నిర్వాసితులు మంగళవారం మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోటోకు క్షీరాభిషేకం చేశారు. తమకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని ఎన్నో రోజులుగా ధర్నా చేపట్టినా పట్టించుకోని ప్రభుత్వం, రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతోనే చెల్లించిందని నిర్వాసితులు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేసిన రాజగోపాల్​రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అనంతరాజు గౌడ్, రామదాసు శ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షుడు చెరుకు శ్రీరామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.