పెండింగ్ సమస్యలు పరిష్కరించండి

 పెండింగ్ సమస్యలు పరిష్కరించండి
  • సింగరేణి సీఎండీకి అధికారుల సంఘం ఇన్ చార్జుల వినతి

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణిలో పనిచేస్తున్న అధికారుల పెండింగ్​ సమస్యలు పరిష్కరించాలని సింగరేణి సీఎండీ ఎన్. బలరాం నాయక్​ను కొత్తగా ఎన్నికైన కోల్​మైన్స్​ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్​ఇండియా సింగరేణి బ్రాంచి కమిటీ కోరింది. మంగళవారం సంఘం ప్రెసిడెంట్​ తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్, జనరల్​సెక్రటరీ పెద్ది నర్సింహులు, వైస్ ప్రెసిడెంట్​ పొనగోటి శ్రీనివాస్​ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు హైదరాబాద్​లో సీఎండీని మర్యాదపూర్వకంగా కలిశారు.

అధికారుల ప్రమోషన్ల సమస్యలు, కోలిండియాలో ఉన్న ప్రమోషన్​ విధానం, ల్యాప్​టాప్​ల అందజేత, ఫ్రీ పవర్, రీజియన్​ పరిధిలో కేవీ స్కూల్స్​ఏర్పాటు, అప్పిలేట్​ బోర్డు మీటింగ్​వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అసోసియేషన్​తో పూర్తి స్థాయి మీటింగ్​ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్, పా) ఎన్ వీకే శ్రీనివాస్, డైరెక్టర్​(పీపీ) జి.వెంకటేశ్వర్ ​రెడ్డి, డైరెక్టర్ (ఈఎం) డి.సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​(కోల్​మూవ్​మెంట్​) ఆల్విన్, జీఎం(కోఆర్డినేషన్​) సురేశ్​ వేర్వేరుగా సీఎండీని కలిశారు.