పద్మరావునగర్, వెలుగు: బోయిగూడలోని ఎంఎన్కే విఠల్ సెంట్రల్ కోర్టు అపార్ట్మెంట్లో అధిక నీటి బిల్లులు, డ్రైనేజీ లీకింగ్, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని బీఆర్ఎస్ పద్మారావునగర్ ఇన్చార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ తెలిపారు. బన్సీలాల్ పేట డివిజన్ కార్పొరేటర్ హేమలతతో కలిసి బుధవారం సెంట్రల్ కోర్టు అపార్ట్మెంట్ను ఆయన సందర్శించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన గణనాథుడిని దర్శించుకున్నారు. అపార్ట్మెంట్ కనెక్షన్కు పనిచేయని నల్లా మీటర్కు వాటర్ బోర్డు ఏకంగా రూ.2 లక్షల బిల్లు వేసినట్లు స్థానికులు పవన్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వాటర్బోర్డు అధికారులతో మాట్లాడిన పవన్ కుమార్ గౌడ్.. బిల్లు సమస్యను పరిష్కరించాలని సూచించారు.
అదే విధంగా అపార్ట్మెంట్ ఆవరణలో కొన్నేండ్లుగా పార్కింగ్లో ఉన్న వెహికల్స్ కారణంగా దుమ్ము పేరుకుపోతుందని స్థానికులు తెలపగా.. పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ వెహికల్స్ను వారిని అప్పగించాలని చెప్పారు. బోయిగూడ వై జంక్షన్ నుంచి పాత గాంధీ ఆస్పత్రికి వెళ్లే రోడ్డుపై నిత్యం డ్రైనేజీ పొంగుతుండటంతో ఈ సమస్యను పరిష్కరించాలని పవన్ కుమార్ గౌడ్ అధికారులకు ఫోన్ చేసి కోరారు. సమస్యలపై స్పందించిన గుర్రం పవన్ కుమార్ గౌడ్తో పాటు కార్పొరేటర్ హేమలతకు అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్ డాక్టర్ జి. హనుమాండ్లు, కో ఆర్డినేటర్ వెంకటేశ్వర రావు, ఉపాధ్యక్షుడు కె. మోహన్ దాస్, కాళిదాసు, సేతు మాధవరావు, సుధీర్ బాబు, అపార్ట్మెంట్ వాసులు -కృతజ్ఞతలు తెలిపారు.