- గెజిట్ నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ రోజురోజుకూ క్షీణిస్తున్న వేళ.. నాలుగో దశ ఆంక్షలు అమల్లోకి వస్తే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సుల ప్రవేశాన్ని కూడా నియంత్రిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఢిల్లీ కాలుష్యానికి సంబంధించి కేంద్రం రూపొందించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్4 (గ్రాప్ 4) అమల్లోకి వస్తే.. సీఎన్జీ, బీఎస్6 డీజిల్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు మినహా ఇతర రాష్ట్రాల బస్సుల ప్రవేశంపై ఆంక్షలు ఉంటాయని, గ్రాప్ 4ను రద్దు చేస్తే.. ఆంక్షల్లో ఆటోమేటిక్ సడలింపు ఉంటుందని బుధవారం రిలీజ్ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది.
ఎయిర్ క్వాలిటీ స్కోర్ను బట్టి కేంద్రం నాలుగు గ్రాప్దశలను వర్గీకరించింది. ఏక్యూఐ300 లోపు స్టేజ్1, ఏక్యూఐ 400 లోపు స్టేజ్2, ఏక్యూఐ 450 లోపు స్టేజ్3, ఏక్యూఐ 450 స్కోర్దాటితే స్టేజ్4గా విభజించింది. కాగా బుధవారం ఉదయం ఢిల్లీ సిటీ అంతటా ఎయిర్క్వాలిటీ బాగా దిగజారింది. మంగళవారం నాటికి 365 పాయింట్ల దగ్గర ఉండగా, బుధవారం ఉదయం 9.05 గంటలకు 394 పాయింట్లకు పెరిగింది.