జోగుళాంబ ఆలయాన్ని అగ్రగామిగా నిలుపుతం : సీఎం రేవంత్ రెడ్డి

జోగుళాంబ ఆలయాన్ని  అగ్రగామిగా నిలుపుతం :  సీఎం రేవంత్ రెడ్డి

అలంపూర్, వెలుగు : అలంపూర్  జోగుళాంబ అమ్మవారి ఆలయాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్  రెడ్డి హామీ ఇచ్చారు. ఏఐసీసీ జనరల్  సెక్రటరీ డాక్టర్ ఎస్ఏ సంపత్  కుమార్, జోగుళాంబ ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్  శర్మ ఆదివారం హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు జోగుళాంబ అమ్మవారి జ్ఞాపిక, అమ్మవారి ప్రసాదం అందజేశారు. అమ్మవారి ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల సౌకర్యం కోసం చేపట్టాల్సిన వివిధ పనుల గురించి సంపత్ కుమార్ ను సీఎం రేవంత్  అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే జోగుళాంబ ఆలయాన్ని దర్శించుకుంటామని సీఎం తెలిపారు. అలాగే దేవాదాయ, పర్యాటక శాఖలపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు.