రిటైర్డ్​ ఎంపీడీవో కిడ్నాప్.. విషాదాంతం

రిటైర్డ్​ ఎంపీడీవో కిడ్నాప్.. విషాదాంతం

జనగామ జిల్లాలో  బచ్చన్నపేట నుంచి పోచన్నపేటకు వెళ్తుండగా కిడ్నాప్​కి గురైన రిటైర్డ్​ ఎంపీడీవో రామకృష్ణ మిస్టరీ విషాదంగా ముగిసింది. ఆయన ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణ కనిపించడం లేదంటూ 3 వారాల క్రితం ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు జూన్​18న చంపక్​ హిల్స్​ శివారులో గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. అది రామకృష్ణదే అని నిర్ధారించుకున్నాక హత్య చేసి కుంటలో పడేసినట్లు పోలీసులు భావించారు.

భూవివాదంలో ఆయన్ని సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు చివరికి నిర్ధారించారు. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేసినట్లు సమాచారం.  ఇందులో అధికార పార్టీ నాయకుడితో పాటు  మరో ముగ్గరిని విచారిస్తున్నారు. జడ్పీ వైస్ చైర్మన్ భర్తతో పాటు ఎమ్మెల్యే తమ అనుచరులతో హత్య చేయించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సీపీ రంగనాథ్​ ఇవాళ మీడియాకు వివరించనున్నారు.

నిరసనలు..

రామకృష్ణను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ..  బచ్చన్నపేట చౌరస్తాలో కుటుంబ సభ్యులు నిరసనలు తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.