జనగామ అర్బన్, వెలుగు: ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడంతో పాటు తెచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేక అప్పుల ఊబిలో చిక్కుకొని ఓ రిటైర్డ్ టీచర్ సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా కేంద్రంలోని పూర్ణిమ కాలనీలో రిటైర్డ్ టీచర్ పగిడిపాటి మల్లయ్య(63) ఉంటున్నాడు. అతని బావమరుదులు రత్నాకర్, మనోహర్ కోట్ల రూపాయలు లాక్కొని చేతులెత్తేయడంతో మానసికంగా కుంగిపోయాడు.
ఈ క్రమంలో అప్పు చేసి కూతురి వివాహం చేశాడు. బిడ్డ పెళ్లికి అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తట్టుకోలేక, ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడంతో 33 పేజీల సూసైడ్ నోట్ రాసి ఇంటి మెయిన్ డోర్ కు ఉరేసుకున్నాడు. మృతుడికి భార్య అనిత, కొడుకు భార్గవ, కూతురు మౌక్తిక ఉన్నారు. ఘటనా స్థలాన్ని జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి పరిశీలించి, డెడ్బాడీని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
