రేవంత్ పిట్టల దొర.. బండి సంజయ్ బ్రోకర్..

రేవంత్ పిట్టల దొర.. బండి సంజయ్ బ్రోకర్..

బచ్చన్నపేట,వెలుగు: రేవంత్ రెడ్డి ఒక పిట్టల దొర అని, బండి సంజయ్ ఒక బ్రోకర్ అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మండిపడ్డారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. శనివారం బచ్చన్నపేటలో పీఏసీఎస్ ఆఫీస్​, గోదాం, ఓవర్ హెడ్ ట్యాంక్, సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం వడ్ల కొనుగోళ్లు చేయమని చేతులెత్తేస్తేనే.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ పనితనం వల్ల సాగు నీటి సమస్యలు దూరమయ్యాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్​నాయకులు చేస్తున్న విమర్శలను టీఆర్ఎస్ నాయకులు తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో రైతుంబంధు జిల్లా కో ఆర్డినేటర్​ ఇర్రి రమణారెడ్డి, జడ్పీవైస్​చైర్మన్​ భాగ్యలక్ష్మి, పీఎసీఎస్ చైర్మన్ పులిగిళ్ల పూర్ణచందర్, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి, సర్పంచ్​లు వడ్డెపల్లి మల్లారెడ్డి, మధు, బాల్​రెడ్డి తదితరులున్నారు.

వర్క్స్ స్పీడప్ చేయాలి..

జనగామ, వెలుగు: జిల్లాలో చేపట్టిన ‘మన ఊరు–మన బడి’, పల్లెప్రగతి, హరితహారం, ఆట స్థలాల పనులు స్పీడప్ చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కలెక్టర్ శివలింగయ్య ఆదేశించారు. శనివారం కలెక్టరేట్​లో ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులంతా కలిసి ఆయా పనుల్ని గడువులోగా పూర్తి చేయాలన్నారు. వానలు ప్రారంభమైన నేపథ్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు.