కేసీఆర్ నిధుల మళ్లింపు, భూముల రిజిస్ట్రేషన్ ఆపండి : రేవంత్ రెడ్డి

కేసీఆర్ నిధుల మళ్లింపు, భూముల రిజిస్ట్రేషన్ ఆపండి : రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటమి భయంతో రైతు బంధు నిధులను ఇతర చెల్లింపులకు మళ్లీస్తున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కమీషన్ల కోసం రైతు బంధు నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ భూములను ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసే పక్రియ జరుగుతోందన్నారు. 

ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్స్ పై నిఘా పెట్టాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ట్రాన్సాక్షన్స్ పై విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టాలని హైదరాబాద్, ఢిల్లీలో ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. శనివారం (డిసెంబర్ 2న)  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ను కాంగ్రెస్ నేతలు కలవనున్నారు.