అమ్మవారిపై రేవంత్ ప్రమాణం.. చివరి బొట్టు వరకు కేసీఆర్ పై పోరాడుతా

 అమ్మవారిపై రేవంత్ ప్రమాణం.. చివరి బొట్టు వరకు కేసీఆర్ పై పోరాడుతా

తనపై బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను సవాల్ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మీ టెంపుల్ కు చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రమాణం చేశారు. అనంతరం బయటకు వచ్చిన రేవంత్ మీడియాతో మాట్లాడారు. అమ్మవారిపై తాను ఆత్మసాక్షగా ప్రమాణం చేశానని రేవంత్ రెడ్డి చెప్పారు.  తాను హిందువునని, అమ్మవారి నమ్ముతానని అన్నారు. తాను కేసీఆర్,టీఆర్ఎస్ నేతల దగ్గర ఒక్కరూపాయి కూడా తీసుకోలేదన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఒక్క రూపాయి తీసుకున్న తాను సర్వనాశానం అయిపోతానని  రేవంత్ రెడ్డి చెప్పారు.  

చివరి రక్తపు బోట్టు వరకు, ఒంట్లో భయం లేకుండా  కేసీఆర్ తో పోరాడుతానని అన్నారు.  ఎలాంటి లాలుచీకి అవకాశం ఇవ్వనన్నారు.  మునుగోడులో బీజేపీ, బీఆర్ఎస్ వందల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. మునుగోడులో రూ. 300 కోట్ల అమ్మకాలు జరిగాయని అన్నారు. మునుగోడులో నిజాయితీగా పనిచేసి స్రవంతిని అభ్యర్థిగా బరిలో నిలిపి  ఒక్క నోటు ఇవ్వకుండా ఓటు అడిగామని తెలిపారు.  రేవంత్ రెడ్డి  భాగ్యలక్ష్మీ టెంపుల్ కు రావడంతో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.