కేసీఆర్ ఏపీ, తెలంగాణను తిరిగి కలిపే కుట్ర చేస్తుండు : రేవంత్ రెడ్డి

కేసీఆర్ ఏపీ, తెలంగాణను తిరిగి కలిపే కుట్ర చేస్తుండు : రేవంత్ రెడ్డి

కేసీఆర్ ఏపీ, తెలంగాణను తిరిగి కలిపే ప్రయత్నం చేస్తున్నాడని టీపీసీసీ చీఫ్ఆ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రెండు రాష్ట్రాలను కలిపే విషయంలో గురువారం సజ్జల మాట్లాడిన మాటల్ని తేలితగా తీసుకోవద్దని చెప్పారు.సజ్జల కామెంట్స్ ను టీఆర్ఎస్ నేతలు కనీసం ఖండించలేదంటేనే అర్థం చేసుకోవాలని అన్నారు. సజ్జల మాటల వెనుక కేసీఆర్ ప్రమేయం ఉందని విమర్శించారు. ఏపీ, తెలంగాణ తిరిగి కలిసిపోతే రెండు రాష్ట్రాల్లో పోటీ చేయొచ్చని కేసీఆర్ భావిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ కు ఏనాడూ తెలంగాణతో పేగు బంధంలేదని, టీఆర్ఎస్, బీఆర్ఎస్ గా మారడంతో పేరు బంధం కూడా లేకుండా పోయిందని రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ గా మార్చడంపై ఎలక్షన్ కమిషన్ అభ్యంతరాలు చెప్పాలని అడిగిందని, అయితే తాను సీఈసీని కలిసేందుకు వెళ్తే కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వలేదని రేవంత్ వాపోయారు. పీసీసీ చీఫ్, ఎంపీగా ఉన్న తనను కలిసేందుకు సీఈఓకు వీలుపడలేదని విమర్శించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి బీఆర్ఎస్ గా మార్చిదని, కేసు పెండింగ్ లో ఉన్నందున పేరు మార్చేందుకు వీల్లేదని అన్నారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశానని రేవంత్ స్పష్టం చేశారు.

ఓట్లను చీల్చేందుకే బీజేపీ టీఆర్ఎస్ ను వాడుకుంటోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అక్రమాలపై, బంగారు కూలీపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బంగారు కూలీ పేరుతో వందల కోట్లు వసూల్ చేసిన పార్టీ ఆ లెక్కలు ఎక్కడా చూపించలేదని అన్నారు. దీనిపై అన్ని దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.