కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్టులను ఖండించిన రేవంత్ రెడ్డి

 కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్టులను ఖండించిన రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్ బయటకు రారని, సామాన్యులకు కూడా ప్రవేశం లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, తమని గృహనిర్బంధాలు చేసినా ఎదుర్కొంటామని చెప్పారు. రాష్ట్రంలో సర్పంచ్‌ల దుస్థితికి వ్యతిరేకంగా ధర్నా చేయకుండా పోలీసులు తన ఇంటిని & ముఖ్య నాయకులందరినీ చుట్టుముట్టారన్నారు. ప్రజాస్వామ్యమా... ఎక్కడున్నావు!? అంటూ ప్రశ్నించారు. దాంతో పాటు హిట్లర్ కేసీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జతచేశారు.

ఇక సర్పంచ్ ల సమస్యల పై ధర్నాకు సిద్ధమైన కాంగ్రెస్ నేతలను పోలీసు హౌస్ అరెస్టులు చేయడాన్ని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నానని ట్వీ్ట్ చేశారు. కేసీఆర్ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో రాస్తారోకో చేయాలన్నారు. దిష్టిబొమ్మలు దగ్ధం చేయాల్సిందిగా శ్రేణులకు పిలుపునిస్తున్నానని చెప్పారు.