కర్షకులే నీకు కర్రుకాల్చి వాత పెట్టుడు ఖాయం

కర్షకులే  నీకు కర్రుకాల్చి వాత పెట్టుడు ఖాయం

సీఎం కేసీఆర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ కుంభకర్ణుడులా 16 రోజులు ఫాంహౌస్ లో సేదతీరి వచ్చాడని.. రైతేమో ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారని ట్వీట్ చేశారు. ఐకేపీ కేంద్రాలలో టార్పాలిన్ లు గతిలేక రైతు కష్టం వర్షపునీటిలో కొట్టుకుపోయిందన్నారు. ఇదేం రాక్షసత్వం కేసీఆర్ అని ప్రశ్నించారు. కర్షకులే కేసీఆర్ కు కర్రుకాల్చి వాత పెట్టుడు ఖాయమన్నారు.

ఏప్రిల్ 29 నుంచి సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఉన్నారు. దాదాపు 17 రోజుల తర్వాత ఫాంహౌస్ నుండి నిన్న( సోమవారం) ప్రగతిభవన్‌కు వచ్చారు. ప్రగతిభవన్‌కు రాగానే పార్టీ ముఖ్యనేతలు, అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఇవాళ రాజ్యసభ అభ్యర్థులను సీఎం ఖరారు చేయనున్నారు. బుధవారం మంత్రులు, కలెక్టర్లతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పట్టణ ప్రగతి, పల్లెప్రగతిపై సమీక్ష చేయనున్నారు. కాంగ్రెస్, బీజేపీ తమ సభలతో  ప్రభుత్వంపై విరుచుకపడుతున్న తరుణంలో కేసీఆర్ కూడా త్వరలోనే ప్రెస్ మీట్ నిర్వహించి వారికి కౌంటర్ ఇస్తారని తెలుస్తోంది.

17 రోజుల తర్వాత ప్రగతిభన్ కు కేసీఆర్

టెస్ట్ డ్రైవ్ అన్నాడు.. కారు ఎత్తుకెళ్లాడు, 100 రోజుల తర్వాత