అరికెపూడి గాంధీవి అన్నీ దొంగ బుద్ధులే: రేవంత్​ రెడ్డి

అరికెపూడి గాంధీవి అన్నీ దొంగ బుద్ధులే: రేవంత్​ రెడ్డి

మాదాపూర్, వెలుగు : పదేండ్లు కేసీఆర్​కు అవకాశం ఇస్తే శేరిలింగంపల్లి యువతకు ఉపాధి కల్పించేందుకు కంపెనీలు తేలేదని, ఇక్కడి భూములను తెగనమ్ముకున్నారని టీ పీసీసీ ప్రెసిడెంట్​రేవంత్​రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే పేరులోనే గాంధీ ఉంది కానీ, అరికెపూడి గాంధీవి అన్నీ దొంగ బుద్ధులేనని ఘాటుగా విమర్శించారు. తిన్నంటి వాసాలు లెక్కపెట్టే వారిలా ఈ ప్రాంతానికి అన్యాయం చేశారన్నారు. 

ఆదివారం సాయంత్రం శేరిలింగంపల్లిలోని కొండాపూర్​ఆర్టీఏ ఆఫీస్​వద్ద నిర్వహించిన రోడ్​ షోలో శేరిలింగంపల్లి కాంగ్రెస్​అభ్యర్థి జగదీశ్వర్​గౌడ్​తో కలిసి పాల్గొని మాట్లాడారు. 2014లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యేగా గాంధీని గెలిపిస్తే శత్రువు పక్కన చేరి, ఇంటి దొంగగా మారి తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నారు. 1964లో బీహెచ్​ఈఎల్​పరిశ్రమ వస్తే 200 ఎకరాల భూములు కోల్పోయిన జగదీశ్వర్​గౌడ్​బాబాయి కాంగ్రెస్​నేత మల్లికార్జున్​నిజాయితీగా సేవలు చేశారన్నారు. రాజకీయాల్లో మంచిని బతికించాలంటే జగదీశ్వర్​గౌడ్​ను గెలిపించాలని కోరారు. 

ఎమ్మెల్యే టికెట్​ను జెరిపాటి జైపాల్, రఘునాథ్​యాదవ్​ఆశించారని, అధికారంలోకి రాగానే ఇద్దరికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ నేత, సినీ నిర్మాత బండ్ల గణేశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.