భారీ కాన్వాయ్తో భాగ్యల‌క్ష్మీ టెంపుల్కు రేవంత్ రెడ్డి

 భారీ కాన్వాయ్తో భాగ్యల‌క్ష్మీ టెంపుల్కు రేవంత్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిదగ్గర నుంచి  చార్మినార్ దగ్గర లోని భాగ్యలక్ష్మీ టెంపుల్ కు బయలుదేరారు.  భారీ కాన్వాయ్తో రేవంత్ రెడ్డి అక్కడికి బయలుదేరారు. తనపై ఆరోపణలు చేసిన వారందరూ భాగ్యలక్ష్మీ  టెంపుల్ టెంపుల్ వద్దకు వచ్చి తడి బట్టలతో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.  

ప్రమాణం చేశాకే తాను మాట్లాడుతానని రేవంత్ మీడియాతో అన్నారు.  మరో ఆరగంటలో రేవంత్  భాగ్యలక్ష్మీ టెంపుల్ కు చేరుకోనున్నారు. దీంతో  భాగ్యలక్ష్మీ టెంపుల్ పరిసరాల్లో  పోలీసులు భారీగా మోహరించారు.  ఇదే భాగ్యలక్ష్మీ  టెంపుల్ వద్ద బండి సంజయ్, పైలట్ రోహిత్ రెడ్డి వంటి నేతలు గతంలో ప్రమాణస్వీకారం చేశారు.