కాంగ్రెస్ వచ్చాక హోంగార్డులను క్రమబద్దీకరిస్తాం : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ వచ్చాక హోంగార్డులను క్రమబద్దీకరిస్తాం : రేవంత్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హోంగార్డులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హోంగార్డు రవీందర్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన కుటుంబానికి నష్టపరిహారం కింద రూ.25 లక్షలు చెల్లించాలన్నారు. ఉన్నతాధికారుల ఒత్తిడి వల్లే రవీందర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. రవీందర్ భార్య చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. హోంగార్డులందరూ వచ్చి మద్దతు ఇవ్వాలని కోరారు. 

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉస్మానియా ఆసుపత్రికి వచ్చి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నుండి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ఉస్మానియా ఆస్పత్రికి హోంగార్డులను రానీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.