60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో FCI కి ఇచ్చిందెంత?

60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో FCI కి ఇచ్చిందెంత?

60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో తెలంగాణ ప్రభుత్వం.. FCI కి ఇచ్చింది ఎంత అని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పాతధాన్యమే ఇవ్వకుండా.. కొత్త ధాన్యంపై రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేయకుండా తెలంగాణకు పారిపోయి వచ్చారని ఆరోపించారు. ప్రజలను మోసం చేయడానికే.. పార్లమెంట్ లో నిరసనల పేరుతో డ్రామా చేశారన్నారు. సావుడప్పు కార్యక్రమంలో కేసీఆర్ కుటుంబం ఎందుకు పాల్గొనలేదన్నారు.. మోడీ ఒప్పందంలో భాగంగానే వీళ్లు సావుడప్పు కార్యక్రమానికి దూరంగా ఉన్నారని తెలిపారు. డిసెంబర్ 27న ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు రేవంత్ రెడ్డి. పార్టీలకతీతంగా పాల్గొనాలన్నారు. కేటీఆర్, సంతోష్ రావు ఇప్పుడు విహార యాత్రలో ఉన్నారా?..గోవాలో ఉన్నారా? లేక విదేశీ టూర్ లో ఉన్నారా చెప్పాలన్నారు. కేశవరావు ఎంపిల బృందంలో ఎందుకు లేరన్నారు.