అవసరమైతే సీతక్కను సీఎం చేస్తాం:రేవంత్ రెడ్డి

అవసరమైతే సీతక్కను సీఎం చేస్తాం:రేవంత్ రెడ్డి
  • సీఎం అభ్యర్థులను కాంగ్రెస్ ముందుగా ప్రకటించదు 
  • తానా సభల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 

న్యూయార్క్ :   ఎలక్షన్స్ ముందు సీఎం అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయం  కాంగ్రెస్ లో లేదన్నారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  అవసరమైతే సీతక్కను పార్టీ సీఎం చేస్తుందని చెప్పారు.  పోలవరం, అమరావతిలను నిర్మించేది కాంగ్రెస్సే అని   టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  స్పష్టం చేశారు. 

ALSO READ :క్రమబద్ధీకరణ రుసుం తగ్గించాలని బీజేపీ శ్రేణుల నిరసన

అమెరికాలోని తానా సభల్లో ఎన్నారైలు  అడిగిన పలు  ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు రేవంత్. దళితులు, ఆదివాసీలను సీఎం కానివ్వరా అని.. అధికారంలోకి వస్తే సీతక్కకు ఉపముఖ్యమంత్రి పదవైనా ఇవ్వాలని ఎన్నారైలు కోరారు. దీనిపై రేవంత్ స్పందిస్తూ అవసరమైనతే పార్టీ సీతక్కను సీఎం చేస్తుందన్నారు.