దేశంలోని ప్రధాన ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సే

దేశంలోని ప్రధాన ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సే

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో చెలగాటం ఆడుతున్నాయన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు  అన్ని విధాల న్యాయం చేశామన్నారు. ఎన్నో చట్టాలను మార్చి రైతులకు మద్దతు ధర ఇచ్చామన్నారు. కేటీఆర్ విలాసవంతమైన టూర్లకు వెళ్లొచ్చారన్నారు. కాంగ్రెస్ దేశానికి ఏం చేసిందని డ్రామారావు ఎదురుదాడి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ దేశానికి ఏం చేసిందనేది డ్రామారావుకు అవగాహన లేదన్నారు. దేశంలోని ప్రధాన ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్సేనన్నారు.  హరిత విప్లవాన్ని తీసుకొచ్చి ఎన్నో ప్రాజెక్టులు నిర్మించిందన్నారు. రైతుకు కనీస మద్ధతు ధర విధానం తెచ్చింది  కాంగ్రెస్సేనన్నారు. ఎస్సెన్షియల్ కమాడిటీ యాక్ట్ తెచ్చింది కూడా కాంగ్రెస్సే అని అన్నారు. మండి విధానాలు, రైతులకు ఉచిత కరెంట్ కల్పించింది కాంగ్రెస్ అని అన్నారు.  దేశంలో రూ. 70 వేల కోట్ల రుణమాఫీ చేసింది కూడా కాంగ్రెస్సేనన్నారు రేవంత్. టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ను తక్కువ చేసి మాట్లాడుతున్నారన్నారు. దేశానికి కాంగ్రెస్ ఎంతో చేసిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 7 వేల మంది రైతులు చనిపోయారన్నారు.