మోడీ అంటే భయపడుతున్నారా?. రాజీపడుతున్నారా?

మోడీ అంటే భయపడుతున్నారా?. రాజీపడుతున్నారా?

పెట్రోల్, డీజిల్, నిత్యవసర ధరల పెరుగుదలపై పోరాటానికి టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో మోహం చాటేశారన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. మంత్రి కేటీఆర్ కు బహిరంగ లేఖ రాసిన రేవంత్ టీఆర్ఎంసీలు పార్టమెంట్ కు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.  మోడీ అంటే భయపడుతున్నారా? లేక రాజీపడుతున్నారా అని అన్నారు.  ఎమ్మెల్సీ ఎన్నిక లబ్ధి కోసమే విశాఖ ఉక్కు పోరాటానికి టీఆర్ఎస్ మద్దతు తెలుపిందన్నారు.  తెలంగాణకు రావాల్సిన వాటిపై పోరాడరు కానీ విశాఖ ఉక్కు కోసం పోరాడతారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ మోసం సరిహద్దులు దాటుతోందన్నారు.