రెచ్చిపోయిన రెవెన్యూ ఉద్యోగి

రెచ్చిపోయిన రెవెన్యూ ఉద్యోగి

క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వెళ్లిన వ్యక్తి పై దాడికి పాల్పడ్డాడు ఓ రెవెన్యూ ఉద్యోగి. ఈ ఘటన కృష్ణా జిల్లా నూజివీడులో  జరిగింది. ముసునూరుకు చెందిన మద్దాల బాబురావు వారం రోజుల క్రితం కులం సర్టిఫికెట్ కోసం స్థానిక తహశీల్దార్ ఆఫీసుకు వెళ్లి దరఖాస్తు చేసుకున్నాడు. వారం రోజులు గడుస్తున్నా ఇంకా సర్టిఫికెట్ రాక పోవడంతో…రెవెన్యూ ఉద్యోగి అయిన పవన్ కుమార్ ను ఇదే విషయంపై అడిగాడు. లంచం ఇవ్వనిదే సర్టిఫికెట్ ఇవ్వరా అంటూ నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.

దీంతో నన్నే ప్రశ్నిస్తావా అంటూ విచక్షణారహితంగా బాబురావుపై దాడి చేశాడు. ఈ దాడిలో బాబురావు కంటికి గాయమైంది. ఘటనపై పవన్, బాబురావు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కులం సర్టిఫికెట్ కోసం వెళ్లిన వ్యక్తిపై దాడి చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

పవన్ కుమార్ తహశీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు.