ఉత్తర ప్రదేశ్: యూపీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలయిన నేపథ్యంలో యూపీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించనుంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ యూపీ ఎన్నికల ఇంచార్జి ప్రియాంక గాంధీ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. రాహుల్, ప్రియాంక కాళ్లరిగేలా తిరుగుతూ ప్రచారం చేసినా కాంగ్రెస్ కు చేదు ఫలితాలు తప్పలేదు. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 255 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ 2 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో పార్టీ ఓటమికి గల కారణాలు, భవిష్యత్ ప్రణాళిక గురించి చర్చించనున్నారు. పార్టీకి చెందిన పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
Congress party general secretary in-charge of Uttar Pradesh, Priyanka Gandhi Vadra to chair a review meeting in Delhi on Uttar Pradesh Assembly election results. Senior party leaders of the state and other party officials will attend the meeting
— ANI (@ANI) March 15, 2022
(File pic) pic.twitter.com/waW770byHa