ధోని రికార్డ్ బద్దలు కొట్టిన పంత్

ధోని రికార్డ్ బద్దలు కొట్టిన పంత్

టీమీండియా  యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మిస్టర్ కూల్ ధోనీ రికార్డ్ బద్దలు కొట్టాడు. మంగళవారం వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ 20 లో పంత్ 42 బాల్స్ లో 65 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. టీ20ల్లో వికెట్ కీపర్ గా అత్యధిక వ్యక్తిగత స్కోర్  చేసిన రికార్డు భారత్ నుంచి ధోని(56) పేరిట ఉంది. లేటెస్ట్ గా పంత్  65 రన్స్ చేసి ధోని రికార్డ్ ను బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ లో ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొత్తం మూడు టీ20 ల సిరీస్ ను ఇండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.