సెప్టెంబర్ 21 న ఛలో ఢిల్లీ : ఆర్ కృష్ణయ్య

సెప్టెంబర్  21 న  ఛలో ఢిల్లీ : ఆర్ కృష్ణయ్య

బీసీ రిజర్వేషన్ల కోసం సెప్టెంబర్ 21న చలో ఢిల్లీకి  పిలుపునిచ్చారు  బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య.  మహిళా బిల్లులో బీసీ మహిళ సబ్ కోట కల్పించాలని డిమాండ్  పార్లెమెంట్ లో బీసీ బిల్ పెట్టీ అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  ఇప్పటికే నిరసనలు, ధర్నాలు చేపట్టామని.. దేశంలో బీసీల తిరుగుబాటు రాక ముందే తమ వాటా తమకివ్వాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో బీసీ లకు అన్యాయం జరుగుతుందన్నారు.  

వన్ నేషన్, వన్ ఎలక్షన్ బాగానే ఉంది కానీ నేషన్ లో భాగమైన 56% జనాభా గల బీసీల బతుకుల గురించి పట్టించుకోరా అని ప్రశ్నించారు.  బీసీలంటే లెక్కలేని తనమా అని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో 50 శాతం టికెట్స్ ఇవ్వకపోతే అన్ని పార్టీలకు బుద్ది చెబుతామని హెచ్చరించారు.