ఢీకొట్టి 20 మీటర్లు ఈడ్చుకెళ్లిన బొలెరో ...యువకుడు మృతి

ఢీకొట్టి 20 మీటర్లు ఈడ్చుకెళ్లిన బొలెరో ...యువకుడు మృతి

శామీర్ పేట, వెలుగు: బొలెరో ఢీకొని ఓ యువకుడు మృతిచెందాడు. శామీర్ పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మజీద్​పూర్​కు చెందిన పర్వతపురం హరిబాబు(35) సోమవారం రాత్రి బైక్​పై తూంకుంట నుంచి ఇంటికి వెళ్తున్నాడు. 

నల్సార్ ఎక్స్ రోడ్ వద్ద బొలెరో అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. అదే స్పీడ్​తో బైక్​ను 20 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో హరిబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. బొలెరో డ్రైవర్​వాహనం ఆపి, అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.