శివరాత్రి జాగారం చేసి వస్తుండగా రోడ్డు ప్రమాదం

శివరాత్రి జాగారం చేసి వస్తుండగా రోడ్డు ప్రమాదం
  • మహా శివరాత్రి వేడుకలు ముగించుకొని వెళ్తుండగా ఘటన

గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఉండవెల్లి మండలం బైరాపురం గ్రామ సమీపంలో కోళ్ల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం బైక్​ని  ఢీకొట్టింది.  దీంతో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. మృతులు చెందిన శేఖర్, సాయి, రఫీ మానవపాడు మండలం కొర్విపాడు విలేజీకి చెందిన వారిగా గుర్తించారు. అలంపూరులో మహాశివరాత్రి వేడుకలను చూసుకొని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోదంది.  సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.