షాపింగ్​కు వెళ్లి వస్తూ దంపతులు మృతి

షాపింగ్​కు వెళ్లి వస్తూ దంపతులు మృతి

మరో నలుగురికి గాయాలు
గడిపెద్దాపూర్ శివారులో అదుపు తప్పిన కారు 

అల్లాదుర్గం, వెలుగు: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ శివారులోని నేషనల్ హైవే -161 పై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు చనిపోయారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బోలక్​పల్లికి చెందిన భార్యాభర్తలు నారాయణ (60), దేవమణి (57) బుధవారం దసరా షాపింగ్ చేసుకొని హైదరాబాద్ నుంచి బోధన్ వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు గడిపెద్దాపూర్​శివారులో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కారులోని దేవమణి అక్కడికక్కడే చనిపోగా, తీవ్రంగా గాయపడిన నారాయణను హాస్పిటల్​కు తరలిస్తుండగాచనిపోయాడు. కారులో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను సంగారెడ్డిలోని ప్రైవేట్ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.