రాజధాని ఢిల్లీ రోడ్డుపై పెద్ద గొయ్యి..

రాజధాని ఢిల్లీ రోడ్డుపై పెద్ద గొయ్యి..

దేశ రాజధాని ఢిల్లీ ప్రజలను సమస్యలు వెంటాడుతున్నాయి. ఓ వైపు ట్రాఫిక్ మరో వైపు రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. గుంత ఎక్కడుందో తెలియకపోతే పెద్ద లోయలో పడ్డట్టే ఉంటుందని ఢిల్లీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌లోని ధన్సా స్టాండ్‌కు సమీపంలోని రోడ్డు గుంతల మయంగా మారింది. గుంతల కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

 నజాఫ్‌గఢ్‌లోని ఫిర్నీ రోడ్‌లో ధన్సా స్టాండ్ నుండి బహదూర్‌ఘర్ స్టాండ్ వైపు క్యారేజ్‌వేలో లోయ లాంటి భారీ గుంత ఏర్పాడిందని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గుంతతో ట్రాఫిక్ సమస్య పెరిగిందని చెప్పారు. అధికారులు చొరవతో ట్రాఫిక్ ను మళ్లించామని చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.