
మేడిపల్లి, వెలుగు: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ సాయి రెసిడెన్సీ నుంచి 28వ డివిజన్ బంగారు మైసమ్మ గుడి వరకు రూ.10 కోట్లతో 60 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులను చేపట్టారు. ఈ పనులకు శుక్రవారం మాజీ మేయర్ అజయ్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. బోడుప్పల్ కార్పొరేషన్ అభివృద్ధికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కాంగ్రెస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి తోటకూర వజ్రేశ్యాదవ్ పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కొత్త కిశోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, సుమన్ నాయక్, చీరాల నర్సింహా, రాములు, పులకండ్ల జంగా రెడ్డి, రంగా బ్రహ్మన్నగౌడ్, శివశంకర్ పాల్గొన్నారు.