సైకిల్ ను ఢీ కొట్టి గాల్లో పల్టీలు కొట్టిన కారు.. ఐదుగురు మృతి

సైకిల్ ను ఢీ కొట్టి గాల్లో పల్టీలు కొట్టిన కారు.. ఐదుగురు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధురై సమీపంలోని విరుదునగర్ - మధురై హైవేపై తిరుమంగళం దగ్గర ఏప్రిల్ 10 వ తేదీని ఉదయం వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీ కొట్టి గాల్లో పల్టీలు కొట్టింది.   ఈ ఘటనలో కారులో వెళ్తున్న ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురితో పాటు సైకిల్  పై వెళ్తున్న  వ్యక్తి మృతి చెందడా.మరో నలుగురికి గాయాలయ్యాయి.

 ప్రమాదానికి సంబంధించిణ దృశ్యాలు  సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అతి వేగంగా వస్తున్న  కారు ముందు  సైకిల్ పై  వెళ్తున్న  వ్యక్తిని ఢీ కొని రెండు మూడు పల్టీలు కొట్టి.. రోడ్డుకు అవతలి  వైపు పడింది. ఘటనా స్థలానికి వచ్చిన  పోలీసులు  సీసీ టీవీ ఫుటేజ్ చూసి  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది.  ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో క్లియర్ చేశారు.