పోలీసులమని చెప్పి ..రైతుపై దాడి చేసి రూ.17 వేలు కొట్టేసిన దొంగలు

పోలీసులమని చెప్పి ..రైతుపై దాడి చేసి రూ.17 వేలు కొట్టేసిన దొంగలు
  •      శామీర్​పేట పీఎస్ పరిధిలో ఘటన

శామీర్ పేట,వెలుగు : పోలీసులమని చెప్పి ఓ రైతుపై దాడి చేసిన కొందరు వ్యక్తులు డబ్బు లాక్కెళ్లారు. ఈ ఘటన శామీర్ పేట పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  సిద్దిపేట జిల్లా రామారం గ్రామానికి చెందిన రైతు బకొల్ల దుర్గయ్య అనే వ్యక్తి బోయిన్ పల్లి మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టమాటలు అమ్మి వెహికల్​లో తిరిగి సిద్దిపేటకు వెళ్తున్నాడు.  శామీర్​పేట పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాటగానే  రెండు బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు దుర్గయ్యను అడ్డుకున్నారు.

బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అతడి వెహికల్ కు అడ్డుగా పెట్టారు. తాము పోలీసులమని చెప్పారు. వెహికల్​లో గంజాయి తరలిస్తున్నావంటూ దుర్గయ్యను వారు బెదిరించారు. అదే వెహికల్​లో బాలాజీ మరో వ్యక్తిని దొంగలు కత్తితో బెదిరించారు.అనంతరం దుర్గయ్యపై దాడి చేశారు. అతడి దగ్గరున్న రూ.17 వేలను లాక్కుని పారిపోయారు. బాధితుడి కంప్లయింట్ మేరకు పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.