వరల్డ్ కప్ 2019లో పాకిస్థాన్ తో లీగ్ మ్యాచ్ లో ఇండియా గెలవడంలో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. భారీ సెంచరీతో… పాకిస్థాన్ కు మ్యాచ్ పై ఆశలు గల్లంతు చేశాడు. మ్యాచ్ తర్వాత మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు రోహిత్ శర్మ. పాకిస్థాన్ క్రికెట్ క్రైసిస్ లో ఉంది… వారు ఇండియాపై వరల్డ్ కప్ లో ఏడుసార్లు ఓడారు. తోటి క్రికెటర్ గా.. పాక్ ప్లేయర్లకు మీరిచ్చే సలహా ఏంటి అని రోహిత్ శర్మను మీడియా ప్రతినిధులు అడిగారు. దానికి రోహిత్ శర్మ ఆసక్తికరమైన బదులిచ్చాడు. పాకిస్థాన్ కోచ్ అయ్యుంటే ఏదైనా వారికి చెప్పొచ్చు… కానీ.. ఇప్పుడు ఏం చెప్పమంటారు.. నేనేమీ చెప్పలేను అన్నాడు. దానికి రోహిత్ శర్మతో పాటు.. మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా నవ్వారు.
Q: How do you suggest Pakistan batsmen come out of the current crisis?
Rohit: pic.twitter.com/5cPdElM5rA
— ESPNcricinfo (@ESPNcricinfo) June 17, 2019