కాస్ట్ లీ ఏరియాలో 4 ఎకరాలు కొన్న రోహిత్ శర్మ!

కాస్ట్ లీ ఏరియాలో 4 ఎకరాలు కొన్న రోహిత్ శర్మ!

టీమిండియా లిమిటెడ్ ఓవర్స్ కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలోని తీరప్రాంత పట్టణం అలీబాగ్‌లో స్థలం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ భూమి దాదాపు నాలుగు ఎకరాలు ఉంటుందని.. అతని భార్య రితికా సజ్ దే  ​​పేరు మీద రిజిస్టర్ చేసినట్లు సమాచారం. ఈ భూమి విలువ దాదాపు రూ.9 కోట్లు ఉంటుందని అంచనా. అలీబాగ్ నగరానికి 20 కిలో మీటర్ల దూరంలో  సరళ్ మహాత్రోలి అనే గ్రామంలో ఈ భూమి కొనుగోలు చేసినట్లు తెలిసింది.

'భూ రిజస్ట్రేషన్ కు   సంబంధించి రోహిత్ శర్మ ఈ నెల 14న మా కార్యాలయానికి వచ్చిన మాట వాస్తవమే. అతను భూమిని కొన్నాడా లేదా? అతనితో పాటు ఉన్న వ్యక్తి కొనుగోలు చేశాడా? అనేది మేము నిర్ధారించలేము, ”అని అలీబాగ్ సబ్ రిజిస్ట్రార్ సంజనా జాదవ్ చెప్పారు. అయితే భూమి కొనుగోలు చేసిన తర్వాత రోహిత్, అతని భార్య కొంతమంది స్నేహితులతో కలిసి గ్రామాన్ని సందర్శించారని స్థానికులు చెబుతున్నారు. సచిన్ టెండుల్కర్, షారూఖ్ ఖాన్, విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి, అజిత్ అగార్కర్ వంటి పలువురు క్రికెటర్లు కూడా అలీబాగ్ లో స్థలాలు కొనుగోలు చేశారు.