పాక్పై విజయంతో కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు మోత మోగిస్తున్నాడు. ఇప్పటికే టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డును ఖాతాలో వేసుకుగో...మరో రికార్డును బద్దలు కొట్టాడు. టీ20ల్లో 30 కంటే ఎక్కువ మ్యాచుల్లో అత్యధిక విన్నింగ్ పర్సంటేజీ కెప్టెన్సీ నమోదు చేసిన కెప్టెన్గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.
అత్యధిక విజయశాతం..
రోహిత్ శర్మ ఇప్పటి వరకు 36 టీ20 మ్యాచ్లకు నాయకత్వం వహించాడు. 30 మ్యాచుల్లో ఇండియా గెలిచింది. 6 మ్యాచ్లు ఓడిపోయింది. దీంతో కెప్టెన్సీ విన్నింగ్ పర్సంటేజీ 83.33తో అత్యధిక విజయ శాతం ఉన్న కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు.
అత్యధిక విన్నింగ్ పర్సంటేజీ ఉన్న కెప్టెన్లు
భారత కెప్టెన్ రోహిత్ శర్మ - 83.3%
ఆప్ఘన్ కెప్టెన్ అస్గర్ ఆఫ్ఘన్ - 80.8%
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ - 62.5%
ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ - 59.2%
భారత కెప్టెన్ ఎంఎస్ ధోనీ - 58.6%
ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ - 55.6%
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ - 51.7%
ఉత్కంఠపోరులో విజయం..
ఆసియాకప్ భాగంగా పాకిస్థాన్పై భారత్ సూపర్ విక్టరీ అందుకుంది. తొలుత పాకిస్తాన్.. 19.5 ఓవర్లల్లో 147పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు టార్గెట్ అందుకుని విజయం సాధించింది. ఈ హై ఓల్టేజీ మ్యాచ్లో భారత్ గెలించేందుకు హార్దిక్ పాండ్యా, జడేజా కారణమని చెప్పాలి. ఉత్కంఠపోరులో చివరి ఓవర్లో సిక్స్ కొట్టిన పాండ్యా..విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.