వరుస ఓటములకు పూర్తి బాధ్యత నాదే

వరుస ఓటములకు  పూర్తి బాధ్యత నాదే

ముంబై ఇండియన్స్ కు ఈ సీజన్ ఓ పీడకలలా మిగిలిపోతుందేమోనన్న టెన్షన్ మొదలైంది. లక్నో సూపర్ జాయింట్స్ తో  నిన్న జరిగిన మ్యాచ్ లో ముంబై ఓడిపోయింది. ఇప్పటికే ఆరు మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియన్స్ ఇంత వరకు బోణీ కొట్టలేదు.     ఐదు టైటిల్స్ గెలిచిన జట్టుకు ఈ పరిస్థితి రావడం నిజంగా జీర్ణించుకోలేని పరిస్థితి.  వరుస ఓటములపై స్పందించిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ అంచనాలకు తగ్గట్లు టీంను నడిపించలేకపోతున్నందుకు పూర్తి బాధ్యత తనదేనన్నాడు. ఓడినప్పుడు తప్పులు వెతకడం మామూలేనని..గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామన్నాడు. తప్పు ఎక్కడ జరిగిందో  తెలిస్తే సరిదిద్దుకోవచ్చు కానీ.. అది కనిపించడం లేదన్నాడు.  మరింత మెరుగయ్యేందుకు ఆలోచిస్తున్నామన్నారు.