ముంబై: ఐపీఎల్ 15వ సీజన్లో మెజారిటీ మ్యాచ్లను ముంబైలో ఆడటం వల్ల తమకు అదనపు ప్రయోజనం ఏమీ ఉండబోదని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ‘మాది దాదాపు కొత్త జట్టే. ప్రస్తుత టీమ్లో 70-80 శాతం మంది ప్లేయర్లు ఇదివరకు ముంబైలో ఆడలేదు. పైగా, రెండేళ్ల తర్వాత మేం ముంబైలో ఆడబోతున్నాం. గతేడాది ఇతర ఫ్రాంచైజీలు ఇక్కడ కొన్ని మ్యాచ్లు ఆడినా మా టీమ్ ఒక్కటి కూడా ఆడలేదు. కాబట్టి మాకు ఎలాంటి అడ్వాంటేజ్ ఉండదు’ అని హిట్ మ్యాన్ చెప్పాడు. బొటన వేలి గాయం నుంచి పూర్తిగా కోలుకోని సూర్యకుమార్ ఈ నెల 27న ఢిల్లీతో జరిగే తమ తొలి మ్యాచ్కు అందుబాటులో ఉంటాడో లేదో ఇప్పుడే చెప్పలేనన్నాడు.