ఐసీసీ ర్యాంకింగ్స్: టాప్ ప్లేసులో జడేజా, అశ్విన్

ఐసీసీ  ర్యాంకింగ్స్:  టాప్ ప్లేసులో జడేజా, అశ్విన్

దుబాయ్‌‌: టీమిండియా కెప్టెన్‌‌ రోహిత్​ శర్మ, సీనియర్‌‌ బ్యాటర్‌‌ విరాట్‌‌కోహ్లీ  ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌‌లో కొద్దిగా కిందికి పడిపోయారు. బుధవారం విడుదలైన  బ్యాటర్ల జాబితాలో రోహిత్‌‌ ఒక స్థానం దిగజారి ఎనిమిదో ప్లేస్‌‌లో నిలిచాడు. అతని ఖాతాలో 754 రేటింగ్‌‌ పాయింట్లు ఉన్నాయి. 742 పాయింట్లతో ఉన్న కోహ్లీ పదో ర్యాంక్ సాధించాడు. ఆల్‌‌రౌండర్లలో రవీంద్ర జడేజా టాప్‌‌ ప్లేస్‌‌ కాపాడుకోగా.. రవిచంద్రన్‌‌ అశ్విన్‌‌ మూడు నుంచి రెండో ర్యాంక్‌‌కు దూసుకొచ్చాడు. విండీస్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ జేసన్‌‌ హోల్డర్‌‌ను మూడో ప్లేస్‌‌కు నెట్టాడు. బౌలర్ల జాబితాలో అశ్విన్‌‌ రెండో ప్లేస్‌‌లో ఉండగా.. బుమ్రా నాలుగో ర్యాంక్‌‌లో కొనసాగుతున్నాడు.