టీ20 వరల్డ్ కప్లో దాయాదుల సమరం మొదలైంది. మెల్బోర్న్ వేదికగా భారత్ పాక్ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. 2021 టీ20 వరల్డ్ కప్తో పాటు..ఆసియాకప్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. అటు ఆసియాకప్ జోరును టీ20 వరల్డ్ కప్ లోనూ కొనసాగించాలని బాబర్ ఆజమ్ టీమ్ బరిలోకి దిగింది.
టీమిండియా తుదిజట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్, సూర్యకుమార్, దినేష్ కార్తీక్, హార్దిక్, అశ్విన్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, షమీ
పాకిస్తాన్ తుది జట్టు: బాబర్ అజామ్ (కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్, షాన్ మసూద్, షాదాబ్ ఖాన్, హైదర్ అలీ, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, ఆసిఫ్ అలీ, షాహీన్ ఆఫ్రిదీ, నసీమ్ షా, హారిస్ రవుఫ్