బెంగళూరు హ్యాట్రిక్..పంజాబ్ పై విక్టరీ

బెంగళూరు హ్యాట్రిక్..పంజాబ్ పై విక్టరీ

పది ఓవర్లకు బెంగళూరు స్కోరు 84/4 కొహ్లీ,అలీ,అక్షదీప్ ఫెయిలయ్యారు. పవర్ ప్లే లో చెలరేగిన పార్థివ్ నిష్క్రమించాడు. ఇక ఆశలన్నీ ఏబీ డివిలియర్స్ పైనే .కానీ అతనేమో బంతికోపరుగు తీసేందుకు ఇబ్బందిపడుతున్నాడు. పాతిక బంతుల్లో ఒకే ఒక్కఫోర్  కొట్టగలిగాడు. 14 ఓవర్లకు గానీ వంద దాటని బెంగళూరు 160 రన్స్‌‌‌‌ చేస్తే గొప్పేఅనిపించింది. కానీ , అందరిలా ఆడితే అతను ఏబీ ఎందుకవుతాడు. అందుకే అసాధారణరీతిలో రెచ్చిపోయాడు. తనకు మాత్రమే సొం తమైన షాట్లతో చిన్నస్వామి స్టేడియాన్నిఉర్రూతలూగిం చాడు. మార్కస్‌ స్టొయినిస్ జతగా ఆఖరి ఐదు ఓవర్లలోనే 80 రన్స్‌‌‌‌ బాదేసిజట్టుకు భారీ స్కోరు అందిం చాడు. లోకేశ్‌ రాహుల్‌‌‌‌, పూరన్‌‌‌‌ వణికిం చినా.. ఆఖర్లోబౌ లర్లు కట్టు తప్పకపోవడంతో బెంగళూరు హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది.

బెంగళూరు: రాయల్‌‌‌‌ చాలెంజర్స్‌ బెంగళూరు రాత మారింది. హ్యాట్రిక్‌ విక్టరీ సాధించి లీగ్‌‌‌‌ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి తొలిసారి పైకి కదిలింది. కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ ను ఈ సీజన్‌ లో రెండో సారి బోల్తా కొట్టించిన కోహ్లీసే న 17 పరుగుల తేడాతో మ్యాచ్‌ ను గెలిచి లీగ్‌‌‌‌లో నాలుగో విజయం ఖాతాలోవేసుకుంది. ఏబీ డివిలియర్స్‌ (44 బంతుల్లో 3ఫోర్లు, 7 సిక్సర్లతో 82 నాటౌట్‌ ), మార్కస్‌ స్టొయినిస్‌ (34 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 నాటౌట్‌ )రెచ్ చిపోవడంతో బుధవారం జరిగిన మ్యాచ్‌ లో బెంగళూరు 4 వికెట్లకు 202 పరుగుల భారీ స్కోరుచేసింది. పార్థివ్‌ పటేల్‌‌‌‌( 24 బంతుల్లో 7 ఫోర్లు, 2సిక్సర్లతో 43) రాణించాడు. ఛేజింగ్‌‌‌‌లో 20 ఓవర్లు ఆడిన పంజాబ్‌ ఏడు వికెట్లకు 185 రన్స్‌ మాత్రమే చేసి ఓడిపోయింది. నికోలస్‌ పూరన్‌ (28 బంతుల్లో1 ఫోర్‌ , 5 సిక్సర్లతో 46), లోకేశ్‌ రాహుల్‌‌‌‌ (27బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌ తో 42), మయాంక్‌అగర్వాల్‌‌‌‌ ( 21 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్సర్‌ తో 35)పోరాడినా విజయాన్ని అందించలేకపోయారు.

రాహుల్‌‌‌‌ నుం చి పూరన్‌‌‌‌ దాకా..

భారీ ఛేజింగ్‌‌‌‌ను పంజాబ్‌ ఓపెనర్లు అదిరిపోయేరీతిలో ఆరంభించారు. క్రిస్‌ గేల్‌‌‌‌ (23), లోకేశ్‌ రాహుల్‌‌‌‌ ఎడాపెడా బౌండరీలు బాదేసి బెం గళూరు బౌలర్లకు దడపుట్టించారు. అయితే నాలుగో ఓవర్లోనే గేల్‌‌‌‌ను ఔట్‌ చేసిన ఉమేశ్‌ బెంగళూరు శిబిరంలో ఆనందం రేపాడు. వన్‌ డౌన్‌ లో వచ్చిన మయాంక్‌అగర్వాల్‌‌‌‌(35)తో కలిసి రాహుల్‌‌‌‌ జోరు కొనసాగిం-చడంతో 9 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్‌ వందపరుగులు మార్కు ను దాటేసింది. అయితే పదోఓవర్‌ తొలి బంతికి మయాంక్‌ ను ఔట్‌ చేసిన స్టొయినిస్‌ బెం గళూరుకు బ్రేక్‌ ఇచ్చాడు. ఆ వెంటనే బంతిని అందుకున్న మొయిన్‌ అలీ.. ప్రమాదకరంగా మారిన లోకేశ్‌ ను కూడా పెవిలియన్‌ చేర్చడంతోపంజాబ్‌ వేగం తగ్గింది. క్రీజులో ఉన్న మిల్లర్‌ (24),నికోలస్‌ పూరన్‌ కాసేపు నెమ్మదిగా ఆడారు. అయితే వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన 14వ ఓవర్‌ లో మూడుసిక్సర్ లు కొట్టిన పూరన్‌ పంజాబ్‌ ను రేసులోనే ఉంచాడు. అలీ బౌలింగ్‌‌‌‌లో పూరన్‌ రెండు సిక్సర్ లుకొట్టగా, సౌథీ వేసిన 17వ ఓవర్‌ లో మిల్లర్‌ రెండుఫోర్లు కొట్టాడు. ఉమేశ్‌ వేసిన18వ ఓవర్‌ లో పూరన్‌ఇచ్చిన క్యాచ్‌ ను స్టొయినిస్‌ నేలపాలు చేశాడు. ఆఓవర్‌ లో ఆరు పరుగులు రావడంతో పంజాబ్‌ సమీకరణం 12 బంతుల్లో 30కి చేరింది. 19వ ఓవర్‌ లోమిల్లర్‌ , పూరన్‌ ను ఔట్‌ చేసిన సైనీ బెం గుళూరుకు విజయం ఖాయం చేశాడు.పార్థివ్‌ మెరుపులు..టాస్‌ ఓడి ఫస్ట్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌కు దిగిన చాలెంజర్స్‌ కు శుభారంభం దక్కలేదు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(13)స్వల్ప స్కోరుకే పెవిలియన్‌ చేరాడు. షమీ వేసిననాలుగో ఓవర్‌ లో డ్రైవ్‌ ఆడిన విరాట్‌ కవర్స్‌ లోమన్‌ దీప్‌ కు దొరికిపోయాడు. అయితే ప్రారంభంనుంచి ధాటిగా ఆడుతున్న పార్థివ్‌ .. అంకి త్‌ వేసినఐదో ఓవర్‌ లో తొలి సిక్సర్‌ కొట్టి జట్టు స్కోరునుహాఫ్‌ సెంచరీ మార్కు దాటించాడు. షమీ వేసిన ఆరోఓవర్‌ లో పార్థివ్‌ మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌ బాదడంతోపవర్‌ ప్లే ముగిసే సరికి బెం గళూరు 70 పరుగులుచేసింది. కానీ, పవర్‌ ప్లే తర్వాత ఇన్నింగ్స్‌ గాడి తప్పింది. మురుగన్‌ బౌలింగ్ లో పార్థివ్‌ పెవిలియన్‌ చేరగా, మొయిన్‌ అలీ(4)ని అశ్విన్‌ ఔట్‌ చేశాడు.విల్జోన్‌ బౌలింగ్‌‌‌‌లో అక్షదీప్‌ నాథ్‌ (3) ఔటవడంతోబెంగళూరు కష్టాల్లో పడింది

ఏబీమార్కస్విధ్వంసం..

మురుగన్‌ వేసిన 14వ ఓవర్లో భారీ సిక్సర్‌ కొట్టినస్టొయినిస్‌ ఇన్నింగ్స్‌ కు మళ్లీ ఊపు తెచ్చాడు. కానీ,మరో ఎండ్‌ లో డివిలియర్స్‌ చాలా నెమ్మదిగా ఆడాడు. దాంతో, బెంగళూరు స్కోరు 160 దాటితేగొప్పే అనిపించింది. కానీ, ఏబీ ఒక్కసారిగా విజృంభించాడు. వచ్చిన బంతిని వచ్చినట్టు బౌండ్రీలైన్‌ దాటిస్తూ విశ్వరూపమే చూపించాడు. అంకి త్‌వేసిన 15వ ఓవర్లో 4, 6తో ఊపులో కొచ్చిన డివిలియర్స్‌ .. మురుగన్‌ వేసిన తర్వాతి ఓవర్లో మరోబంతిని స్టాండ్స్‌ కు చేర్చాడు. అయితే 17వ ఓవర్‌ లోఅశ్విన్‌ కేవలం ఐదు పరుగులిచ్చాడు. కానీ, విల్జోన్‌బౌలింగ్‌‌‌‌లో 4,6 బాది హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న డివిలియర్స్‌ షమీకి చుక్కలు చూపించాడు.అతను వేసిన 19వ ఓవర్లో హ్యాట్రిక్‌ సిక్సర్లతో రెచ్చిపోయాడు. స్టేడియం బయట పడిన మూడో సిక్సర్‌మ్యాచ్‌ కే హైలైట్‌ . విల్జోన్‌ వేసిన లాస్ట్‌‌‌‌ ఓవర్‌ తొలిబంతిని కూడా స్టాండ్స్‌ కు చేర్చడంతో ఏబీ సెంచరీచేసేలా కనిపించాడు. తర్వాతి బాల్‌‌‌‌కు అతను సింగిల్‌‌‌‌ తీయగా.. స్ట్రయికింగ్‌‌‌‌ వచ్చిన స్టొయినిస్‌వరుసగా4, 6, బాదేసి జట్టు స్కోరును 200దాటించాడు

స్కోర్‌ బోర్డు

రాయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంగళూరు: పార్థి వ్‌ (సి)అశ్విన్‌ (బి) మురుగన్‌ 43, కోహ్లీ (సి)మన్‌ దీప్‌ (బి)షమీ 13, డివిలియర్స్‌ (నాటౌట్‌ ) 82, మొయిన్‌అలీ (బి) అశ్విన్‌ 4, అక్షదీప్‌ (సి) మన్‌ దీప్‌ (బి) విల్జోన్‌ 3, స్టొయినిస్‌ (నాటౌట్‌ ) 46 ; ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రాలు:11;మొత్తం: 20 ఓవర్లలో 202/4

పంజాబ్‌‌‌‌: రాహుల్ (సి) సౌథీ (బి) అలీ 42, గేల్‌‌‌‌ (సి) డివిలియర్స్‌ (బి) ఉమేశ్‌ 23, మయాంక్‌(సి) చహల్‌‌‌‌ (బి) స్టొయినిస్‌ 35, మిల్లర్‌ (సి) డివి-లియర్స్‌ (బి) సైనీ 24, పూరన్‌ (సి) డివిలియర్స్‌(బి) సైనీ 46, మస్‌ దీప్ (నాటౌట్)4, అశ్విన్‌(సి) కోహ్లీ (బి) ఉమేశ్​6, విల్జోన్​(సి) పార్థివ్​ (బి)ఉమేశ్​0, మురుగన్​ (నాటౌట్)1; ఎక్స్‌‌‌‌ట్రాలు:4:మొత్తం: 20 ఓవర్లలో 185/7