రాష్ట్రంలో రూ.1350 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న ఈస్టర్ ఫిల్మ్ టెక్: కేటీఆర్

రాష్ట్రంలో రూ.1350 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న  ఈస్టర్ ఫిల్మ్ టెక్: కేటీఆర్

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ఈస్టర్‌‌ ఫిల్మ్‌‌టెక్‌‌ సంస్థ రూ.1,350 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని మంత్రి కేటీఆర్‌‌ తెలిపారు. ఈస్టర్‌‌ సంస్థ మన దగ్గర ప్యాకేజింగ్‌‌  ఫిల్మ్‌‌ మాన్యుఫ్యాక్చరింగ్‌‌ ప్లాంట్‌‌ స్థాపన చేయడానికి ఓకే చెప్పిందన్నారు. ఆ సంస్థ చైర్మన్‌‌ అరవింద్‌‌ సింఘానియా తో సోమవారం కేటీఆర్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. కంపెనీ నిర్మాణం కోసం మొదట రూ. 500 కోట్లు ఖర్చు చేయటంతో పాటు 2022లో తొలి దశ పనులు పూర్తి చేసేందుకు అరవింద్ సింఘానియా అంగీకరించినట్లు కేటీఆర్ మీడియాకు తెలిపారు. ఈ కంపెనీ ద్వారా దాదాపు 800 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.