ప్రభుత్వ ఆఫీసుల్లో రూ.17 వేల కోట్ల కరెంట్ బకాయిలు..!

ప్రభుత్వ ఆఫీసుల్లో రూ.17 వేల కోట్ల కరెంట్ బకాయిలు..!

ఫాంహౌస్ ల పేరుతో సీఎం కేసీఆర్ పెద్ద స్కాం చేస్తున్నారని తెలిపారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 24 గంటల కరెంటు పేరుతో పెద్ద స్కామ్ చేస్తున్నారని చెప్పారు. సీఎంకు యూనిట్ రూ.6 పెట్టి కరెంటు కొంటున్నారని..ప్రభుత్వ ఆఫీసులు రూ.17 వేల కోట్ల కరెంట్ బకాయిలు చెల్లించాలని తెలిపారు. సిద్దిపేట్, గజ్వేల్, పాతబస్తీ ప్రాంతల్లో కరెంటు బిల్లులు కడుతలేరని.. 40 గ్రామలకు ఉపయోగించే కరెంటును కేసీఆర్ ఫాం హౌస్ కు వినియోగిస్తుండన్నారు. భద్రాది పవర్ ప్లాంట్ ఓ పెద్ద స్కామని .. బినామీ వ్యక్తులకు పవర్ ప్లాంట్ ని అప్పజెప్పిన కేసీఆర్  కమీషన్లు దండుకుంటున్నాడని తెలిపారు. నష్టం వస్తదని తెలిసి ఇండియాబుల్స్ కంపెనీ వదిలేస్తే...బినామీ వక్తుల ద్వారా వేలకోట్ల పెట్టుబడులను కమిషన్ ల కోసం పెట్టారన్నారు.  8 ఏళ్ల బీజేపీ పాలనలో మిగులు ఏర్పడేలా చేసింది ఒక్క మోడీ ప్రభుత్వమే అన్నారు.

సింగరేణి కార్మికుల డిపాసిట్లు డ్రా చేసి జీతాలు చెల్లించే స్థాయికి కేసీఆర్ దిగజారిండని చెప్పారు. రామగుండంలో 6వేల కోట్లపైగా నిధులతో ఎరువుల కర్మాగారం కేంద్రం ఏర్పాటు చేసిందని.. రైతుల కోసం ఏర్పాటు చేసిన రామగుండం ఎరువుల కర్మాగారంను మూసివేసే కుట్ర చేస్తున్నారని తెలిపారు. మతాల గురించి మాట్లాడే వాళ్లకు బైంసా ఘటన, నిర్మల్, కామారెడ్డి, మర్పల్లి హత్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హిందువులపై ఎందుకు వెటకారమన్న బండి సంజయ్..మేము ఎప్పుడైనా అల్లా లేడు అన్నామా? అన్నారు. బైంసాలో విలేకరిపై దాడి చేస్తే ఎందుకు మాట్లాడలేదని వీళ్లంతా హిందూ దేవతలను హేళనగా మాట్లాడినప్పుడు ఎక్కడ పోయారన్నారు. బండి సంజయ్ మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు అంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు.