హైదరాబాద్ సిటీ, వెలుగు: 2025–-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 కోట్లు కేటాయించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు జీహెచ్ఎంసీ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను తొలగించడం, చెరువులు, కుంటలు, నీటి వనరుల పరిరక్షణ, వరదల నిర్వహణ, నగర విపత్తు నిర్వహణ కార్యకలాపాల కోసం ఉపయోగించనున్నారు. ఈ ఏడాది బట్జట్లో హైడ్రాకు రూ.100 కోట్లు కేటాయించగా, అందులో ఇదివరకే రూ.25 కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇప్పుడు మరో రూ.25 కోట్లు విడుదల చేయగా, మరో రూ.50 కోట్లు విడుదల చేయాల్సి ఉంది.

